మా ఉద్యమాలని కించ పరిస్తే ఊరుకోం!
Posted by
netizen నెటిజన్
on Monday, June 9, 2008
1 వ్యాఖ్యలు
ఉద్యామాలని కించ పరిస్తే ఊరుకోరటండి వీరు.
వారికి స్వేచ్హ కావాలి.
స్వతంత్రం కావాలి.
వారి అభిప్రాయాల్ని వెలిబుచ్చడానికి ప్రసార మాధ్యమాలు కావాలి.
వారిని ఆకాశానికేత్తసేటప్పుడు మాత్రమే పత్రికలు కావాలి, టీ వీలు కావాలి.
వారిని ఏ మాత్రం విమర్శిస్తున్నారన్న అనుమానం ఉన్నా,పెట్రొల్ కాని డిజెల్ కాని కిరోసిన్ పోసి, తగలబెట్టే హక్కు కూడా వారికే ఉంటుంది.
అప్పుడు మాత్రం ఆ పత్రికలు పనికి రావు.
ఆ టీ వీలు చూపే బొమ్మలు పనికిరావు.
వాటిలో పనిచేస్తున్న తమ "కులం" వాళ్ళైనా కూడా పనికిరారు.
వాళ్ళందరిని "కాటి" కి చేర్చడానికి కూడా వెనుకాడరు వీరు.
వారు, వారి ఉద్యమాలని కించ పరిస్తే ఊరుకోరటండి.
మంగళవారం 7 వ తేదిన, జూన్ 2008లో, పేజి 8లో సాక్షి దినపత్రికలో ప్రచురితమైన వార్త ఇక్కడ చదవండి.
Labels:
పత్రికలు
1 వ్యాఖ్య:
- Kathi Mahesh Kumar on June 10, 2008 at 1:41 AM said...
-
ప్రశ్నిస్తే, కించపరిచారు అనుకునే ఝాఢ్యం మన జాతి మొత్తంలోనే ఉంది. కృష్ణ మాదిగ దీనికి మినహాయింపు కాడు. ఇక ఇలాంటివి చేస్తేగానీ కావలసినంత మిడియా సమయం, చర్చల్లో విషయాలూ రావుగనక ఇదొక మంచి ఎత్తుగడ మాత్రమే.
Subscribe to:
Post Comments (Atom)