తెలుగు పత్రికలు - తెలంగాణా వాదము
Posted by
netizen నెటిజన్
on Tuesday, March 15, 2011
0 వ్యాఖ్యలు
సమైక్యాంధ్ర ప్రదేశ్ కావాలని కోరుకుంటున్న ఒకానొక ఐక్య కార్యాచరణ సమితికి అందిన ప్రతిపాదనలు ఇవి:
తెలంగాణ పై పత్రికలు, టి.విల పక్షపాత ధోరణి
విజయవాడ నుంచి తెలుగు పత్రికారంగం హైదరాబాదుకు మారడంతో సమైక్యాంధ్ర వాదానికి తన వాణి వినిపించడానికి, ఎదుటి వారు చేసే
పసలేని వాదనలను ఖండించడానికి ఎటువంటి ప్రసార మాధ్యమాల సహాయము లభించడం లేదు.
పసలేని వాదనలను
పత్రికలు, టీవీలు తమ కేంద్ర కార్యాలయాలు హైదరాబాదులో ఉండడం తో, ప్రాంతీయవాదుల దాడులకు భయపడి తె లంగాణ వాదానికే తమ జర్నలిజాన్ని పరిమితం చేస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో కొన్ని పత్రికలు సీమాంధ్ర ప్రజలు తెలంగాణ నివ్వడానికి రాజీ పడినారని, కొందరు స్వార్థ రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు మాత్రమే తిరిగి ప్రజలను రెచ్చ గొడుతున్నాయని సమైక్యాంధ్ర భావనను దెబ్బతీసే విధంగా సంపా దకీయాలను, వార్తలను వ్రాస్తు న్నాయి.
ఇటువంటి పరిస్థితులలో సమైక్యాం ధ్ర వాదులు తమ వాదనను వినిపించడానికి క్రింది చర్యలు తీసుకోవాలి.
1 తెలంగాణ ప్రజలు నాయకులు చేసే తమ వాదనలను పత్రికలు నిరభ్యంతరంగా ప్రచురించవచ్చు. కాని ఆ వాదనలను ఖండించే వార్తలను, ఉత్తరాలను, సమాచారాన్ని ఈ పత్రికలు తప్ప కుండా ప్రచురించాలి.
2 తెలంగాణవాదుల కిచ్చే ప్రాముఖ్యత సమైక్యాంధ్ర వాదులకు కూడా తమ వాదనలను వినిపించడానికి ఇవ్వాలి.
3 తెలంగాణ సామాన్య ప్రజలను రెచ్చగొట్టే నాయకుల ప్రకటనలను 4 ఈ కార్యక్రమములో పత్రికలు టీవీలు ఆంద్ర, తెలంగాణ ప్రాంతాలకు విభిన్న పత్రికలు ప్రచురణ, పంపిణి. ప్రసారాలు చేయరాదు. తెలంగాణా నాయకులు చేసే అసంబద్ద వాదనలలోని మర్మం తెలంగాణ సామాన్య ప్రజలకు కూడా తెలియాలి.
5 సమైక్యాంధ్రుల న్యాయమైన ఈ కోరికలను అంగీకరించని పత్రికల పంపిణి ని, టీవిల ప్రసారాలను సీమాంధ్ర ప్రాంతాలలో నిలిపి వేయాలి.
- * -
అందిన ఆ ప్రతిపాదనలన్నింటిని తీర్మానాలుగా అంగీకరించి వాటిని తెలుగు ప్రసార మాధ్యమాలకు తెలిపింది, ఆ ఐకాస.
ఇక వివిధ పత్రికలలో ఆ ప్రతిపాదనలు వెలువడిన విధంబెట్టినదన్నది పాఠకులు, ఆ పత్రికలలో వెలువడిన పాఠములని జదివి తెలుసుకొనగలరు.
వార్త పత్రికలో
ఈనాడు పత్రికలో
Subscribe to:
Post Comments (Atom)