మీరేమంటారు ?
భారత దేశంలో ఒక పౌరుడు, అన్యాయం జరిగింది అని అనుకున్నప్పుడు ఒక "దిష్టిబొమ్మ" ని పేరిడి, కొట్టి, కాల్చీ తన ఆవేదనని, ఆగ్రహాన్ని, నిరసనని తెలియజేస్తుంటాడు.
ఏ దళితుల ఉద్యమాని తాము ప్రోత్సహించారో, అదే వర్గానికి చెందిన నాయకుడు ఒక పధకం ప్రకారం, తన సిబ్బందిమీద, తన కార్యాలయాల మీద దాడి చెయ్యడానిని గర్హిస్తూ ఆంధ్రజ్యోతి సిబ్బందిలోని కొంతమంది, ఒక "దిష్టిబొమ్మ" ని తయారుచేసి దానిని "దూషించి, అవమానించారు, కాల్చారు."
దళితులమీద అత్యాచార నిరోధక చట్టం క్రింద అది నేరం అంటూ ఆ సంపాదకుడిని, ఆంధ్రజ్యోతి ఎమ్. డి రాధాకృష్ణ , విలేకరులు వంశికృష్ణ, శ్రీనివాస్ ని గూడా అరెస్టు చెయ్యాలని, లేని పక్షంలో తీవ్రమైన పరిమాణాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని మంద కృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. నాటకీయంగా, రాత్రిపూట హుటాహుటిన ప్రభుత్వం సంపాదకుడు శ్రీనివాస్, విలేకరులు వంశీకృష్ణని,శ్రీనివాస్ని అరెస్ట్ చేసింది.
చట్టం ముందు అందరు ఒక్కటి కాదు అన్నది ఇక్కడ నిరూపితమయ్యింది.
మరి పేరులోనే తన కులాన్ని ఇముడ్చుకున్న కృష్ణ మాదిగ, తన కులం పేరుతో తనని ఒక బహిరంగ ప్రదేశంలో దూషించి అవమానించారనడం విడ్డూరం.
నిజంగానే ఈ నేతలు, ఉద్యమకారులు, అటువంటివారైతే, ఈ అగ్రకుల రాజకీయవేత్తలు తమ రాజకీయ చదరంగంలో వీరిని పావులుగా వాడుకుంటున్నారా?
ఒక వేళ అదే నిజమైతే, వీరి ఉద్యమం గతేమిటి?
ఈ రాష్ట్ర ప్రజల భవితేమిటి?
పూర్తిగా చదవండి ...
సామ్ మనెక్ షా కి నివాళి
పూర్తిగా చదవండి ...
ఏం చేస్తారండి?
జాగ్రత్తగా ఉండమంటున్నారు.
ఏం చేస్తారండి?
మెడ మీద తల తీస్తారా?
కాళ్ళూ చేతులు విరక్కొడతారా?
జీవచ్చవంలాగ మిగిలిన జీవితాన్ని, ఏ మంచం మీదో గడిపేలాగా చేస్తారా?
ఏం చేస్తారండి?
దేనికి వెరిచేదిలేదు.
పూర్తిగా చదవండి ...
కులాలకురుక్షేత్రం - శాంతి భద్రతల సమస్య?
దీన్ని ఎటు వైపు మళ్ళిస్తున్నారో?
మళ్ళీ మరో కులాలకురుక్షేత్రం మొదలైనా ఆశ్చర్యం లేదు.
మనం జాగరూకతతో ఉండాలి!
దానికి తావివ్వకూడదు.
సంయమనం పాటించాలి.
విచక్షణను కోల్పోరాదు.
ఇది నేటి ఆంధ్రజ్యోతిలో, రెండవ పేజీలో -
పూర్తిగా చదవండి ...
ఆంధ్రజ్యోతి సంపాదకుడు, శ్రీనివాస్ - దళిత వ్యాసాలు
ఇది బుధవారం,25 జూన న వెలువడిన ఆంధ్రజ్యోతి దినపత్రికలోని తొమ్మిదవపేజిలోని వ్యాసం.
పూర్తిగా చదవండి ...
వాళ్ళందరికి బెయిల్ దొరికిందండోయి!
బ్లాగుల గురించి పత్రికలు రాయాలి!
అందులో పేరు చూసుకుని సంతోషించాలి!
కాని ఆ పత్రికల స్వేచ్హ మీద దాడి జరిగినప్పుడు, ఈ బ్లాగ్ ప్రపంచంలో ఎంత మంది తమ సంఘీభావాన్ని తెలిపారన్నది ఆలోచించాల్సిన విషయం!
మీకు తోచింది చెయ్యండి!
పూర్తిగా చదవండి ...
మంద కృష్ణ మాదిగ మందస్వామ్యం
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సభ్యులు కానివ్వండి, ఆంధ్రజ్యోతి "బాడుగనేతలు" అని పేరిడిన నేతల సంస్థల సభ్యులు కానివ్వండి, వారు కూడ, ఈ సమాజంలో సభ్యులే కదా?
మరి వారికి, ఈ న్యాయ సభలు, చట్టాలు పనికి రావా?
అన్యాయం జరిగినప్పుడు వారు వాటిని అశ్రయించరా?
వారికి నీతి లేదా?
వారి నీతి వేరా?
వారి ధర్మాలు వేరా?
వివాదాలని సామరస్యంగా కూర్చుని పరిష్కరించుకునే అవకాశం లేదా?
సంయమనం పాటించరా?
ఆటవిక న్యాయంతో పాశవీక చర్యలకు పాల్పడి, తమకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోవడమే వారికి తెలుసా?
ఇదేనా వీరి న్యాయం?
ఇదేనా వీరి ధర్మం?
మరి ఈ చట్టలేందుకు, న్యాయ వ్యవస్థలెందుకు?
ఈ రక్షణ దళాలెందుకు?
నేతలు ప్రవర్తించే తీరు ఇదేనా?
ఇది ప్రజాస్య్వామనిపించుకోదు.
ఇది మంద స్వామ్యం!
ఇది నేటి ఈనాడు లోని వార్త!
పూర్తిగా చదవండి ...
వగలాడి అంజలి ఒక 420
అంజలి కధ బ్లాగరి మాటల్లో ఈ క్రింద చదవండి.
అంజలి ఒక నెరజాణ.
వగలాడి.
ఒక మోసగత్తె.
ఒక టక్కులాడి.
వగలు పోతు తన అందంతో మగవాడిని ఉచ్చులోకి లాగి వాడి జేబులో డబ్బు, మెడలో బంగారపు గొలుసులు లాఘవంగా లాగేస్తుంది. వాడు తాగి విజృంభిస్తానంటే అలాగే అంటుంది తనలో తాను నవ్వుకుంటూ. తెలిదుగా ఆ అమాయకుడికి. వాడు నువ్వుకూడా తాగు అంటే కంపెని కోసం అంటూ తాగుతుంది. వాడితో తాగిస్తుంది. వాడు ఆ మత్తులో మునిగే దాక తాగిస్తుంది. తరువాత వాడివన్ని వొలుచుకుని తప్పుకుంటుంది. ఇలాంటి ఆడది దొరికితే ఏ మొగాడు చొంగ కార్చుకోకుండా ఉంటాడూ? పైగా వయసులో ఉన్న ఆడది. ఎర్రగా, పొంకంగా ఉన్న అంజలి పొందుకూడ ఎంత రంజుగా వుంటుందో ! వెమ్మట పడి తనతో రమ్మనకుండా ఉండగలడా? మనకి మన విలేకరి ఇంకోటి కూడా చెపుతున్నాడు - ఈ వగలాడి పెళ్ళి కూడా చేసుకుంది. మొగుడ్ని చంపేసింది కూడా.
ఇది అంజలి కధ - ఈనాడులో.
ముషిరాబాదులో ఒక ఏ టి ఎం దగ్గిర ఒకడు స్వాతి నవ్వులో పడి గిరికీలు కొట్టాడు. ఆనందంతో వంకీలు తిరిగిపొయ్యాడు. రా అన్నాడు. నవ్వుకుంది. సరే పద అంది. ఇంటికి వెల్దాం అన్నాడు. తీసుకెళ్ళమంది. వాడి బుర్రలో మందు, విందూ, పొందూ ఉంది. మందుకి కూడా "సై" అంది. ఇద్దరు తాగారు. తిన్నారు. వాడు పడుకున్నాడు. స్వాతి పడుకోలేదు. తనకి కావల్సినవి తీసుకుంది. వాడిని చూసి నవ్వుకుంది. చీకట్లోకి తప్పుకుంది. వాడికి మెళకువ వచ్చింది. లబో దిబో. పోలిసులున్నారుగా. పరుగెత్తుకెళ్ళాడు.
వాళ్ళు వల విసిరారు.
లేడి వాళ్ళకి చిక్కింది.
ఎర్రగా బుర్రగా ఉంది.
పత్రికల వాళ్ళని పిల్చారు.
స్వాతిని చూపించారు.
వాళ్లు వ్రాసుకున్నారు.
వాళ్ళు వచ్చారు.
ఒంటరి ఆడది.
చీ, ఇది ఆడదేనా అని అన్నారు?
ఆ అన్నది ఆడ ఆంకర్లే!
ఇప్పుడు చెప్పండి, ఎవరి కధనం బాగుంది?
ఈనాడు దా? సాక్షిదా?
సాక్షి లోని ఈ కుర్రాడెవడో స్వంత బుద్ధిని ఉపయోగించి ఆ అమ్మాయి వెమ్మట బడి కొంత వివరాలు తెలుసుకున్నాడు.
విషయం ఒకటే!
రెండు పత్రికలు.
ఇద్దరు విలేకరులు.
రెండు కోణాలు!
నాణేనికి రెండూ పార్శ్వాలు.
ఏది నిజం?
ఏ కధనం సబబు?
వృత్తిపరంగా ఎవరి కధనం సరైనది?
ఎవరి వార్త ని నమ్మాలి?
ఈ బ్లాగరి కధనం పక్కన బెట్టండి.
పూర్తిగా చదవండి ...
అక్షర ఉద్యమం
దానికి ఒక మేరకు కొంత సమాధానం ఇది. పత్రికల ద్వార జరుగుతున్న "అక్షర ఉద్యమం" కి ఒక పార్శ్వం మాత్రమే!
మిగతా పత్రికల ద్వారా " అక్షర ఉద్యమం" జరగడం లేదు, వారు చెయ్యడంలేదు అని ఇక్క డ చెప్పడం ఉద్దేశ్యం కాదు. కేవలం ఈ పత్రికలోని వార్త అందుబాటులో ఉండడంవలన దీనిని మీతో పంచుకోవడం జరుగుతున్నది.
అలాగే ఈ ప్రక్రియే "అక్షర ఉద్యమం" అని నిర్వచించబూనుకోవడంలేదు. ఇలా కూడా చేయవచ్చు, చేస్తున్నారు, ఇలాంటి సత్కార్యాలను, పత్రిక యాజమాన్యాలు ప్రోత్సహిస్తునే ఉంటవి అని చెప్పడమే ఈ టపా ఉద్దేశ్యం.
ఇక "అక్షర ఉద్యమానికి" ఎవరైనా ఒక రూప కల్పన చెసి, ఒక ముసాయిదా ప్రణాలిక తయారు చెయ్యడానికి ముందుకు వస్తే, వారికిదే ఇదే ఆహ్వానం.
పూర్తిగా చదవండి ...
అక్షరం తిరగ బడింది.
తిరగ బడింది.
పెన్నుని గన్ను గా పట్టుకుని దేశాన్ని ఉద్ధరిద్దా మని అనుకునే వాళ్ళు కొంతమంది ఐతే, కులాలకతీతంగా, కలాన్ని అమ్ముకుని డబ్బులు సంపాదిద్దామనుకునే వారు మరి కొందరు. తమ చుట్టు ఉన్న సమాజంలో కుళ్ళుని చూసి, దాని శుభ్రం చెయ్యాలని, తమ చుట్టు పెరుగుతున్న కలుపు మొక్కలని ఏరి పారెయ్యాలాని దానికి ప్రసార మాధ్యమాలైన పత్రికలే తమ అక్షరానికి ఊతం ఇస్తాయని ఆ మార్గాన్ని ఎన్నుకుని మంచి పాత్రికేయులు కావాలని కొంతమంది. నేటి సమాజంలోని ఋగ్మతలకి క్షీణించిన సామాజిక విలువలే కారణం. కాబట్టి, ఉదాత్తమైన విలువలని మళ్ళీ ఈ తరానికి పరిచయంచేయ్యాలంటే మంచి సాహిత్యం కావాలి, మంచి సాహిత్యం అందరికి అందుబాటులో తీసుకెళ్ళాలంటే పత్రికలే తగిన సాధనాలు. ఆ పత్రికా విధులని సరిగ్గా నిర్వర్తించాలంటే దానికి తగిన విద్యార్హతలు నేర్వాలి.
అలాంటి విద్యని మన పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం నేర్పుతున్నది. అందుకని మన రాష్ట్ర రాజధాని ఐన భాగ్యనగరానికి చేరి అక్కడున్న ఆ తెలుగు విశ్వవిద్యాలయం లో ప్రవేశం పొంది, ఉత్తమ పాత్రికేయాన్ని అభ్యసిస్తూ, ఈనాడులోనో, అంధ్రజ్యోతిలోనొ, సాక్షి లోనో ఎదో ఒక తెలుగు పత్రికలో "వార్త" లు రాసే ఉద్యోగం సాధించలేకపోతామా, కలను సాకారం చేసుకోలేక్పోతామా అని ఈ "ఔత్సాహిక భవిష్యత్ పాత్రికేయులు" ఆ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో చేరారు.
కాని వారికి తెలియదు, కరడు గట్టిన స్వార్ధంతో, ముక్కులు పగిలిపొయ్యే దుర్గంధంతో నిండిపోయిన ఆ పొట్టి శ్రిరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారికి కావల్సినది పని పాటా లేని ఉద్యోగం అనిన్ని, నెలాఖరికి జీతమున్ను, అవి రెండు పుష్కలంగా సర్కారు వారి కొలువులే మాత్రమే దొరుకుతాయి కాబట్టి దానీ చంపేయ్యకుండా, అలాగని పూర్తిగా ఆరోగ్యవంతంగా బతకకుండా ఉంటే, ఇలాంటి విద్యార్ధి దౌర్భాగ్యులు (అవును వారి దృష్టిలో, ఆ విద్యార్ధులందరూ దౌర్భాగ్యులే) వస్తూ ఉన్నన్నినాళ్ళు తమకి, తమ పదవులకి, జీతాలకి ఢోకా ఉండదని వాళ్ళు ఎవేవో కొత్త కొత్త ప్రణాలికలు వేసుకుంటు వచ్చినవాడి చెవులో - పూలు పెడుతూ తమ పబ్బం గడుపుకుంటున్నారు.
ఇక ఆ పప్పులు ఉడకవని - తెలుగు విశ్వవిద్యాలయానికి పట్టిన తెగులుని తొలగిస్తామని విద్యార్ధులు ఏకంగా తెలుగు విశ్వవిద్యాలయం మీదే దావా వేసారు. బహుశ ప్రపంచకంలో విద్యార్ధులే విశ్వవిద్యాలయం మీద దావా వెయ్యడం ఇదే ప్రధమమైఉండాలి. మన పొట్టి శ్రి రాములు తెలుగు విశ్వవిద్యలయాన్ని అలాగున గిన్నెస్ బుక్ ఒఫ్ రికార్డ్స్లోకి, లింకా బుక్ ఆఫ్ రికార్డ్లోకి ఎక్కించిన ఘనత కూడ తెలుగు వారిదే అవుతుంది.
హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే జాలంలో ఉన్న తెలుగు విశ్వవిద్యాలయం గూడులొని వివరాలన్ని కూడా ఆంగ్లంలోనే ఉన్నవి. అది మన తెగులు విశ్వవిద్యాలయం సంగతి.
నమ్మరా? వెళ్ళి చూడండి! http://www.teluguuniversity.ac.in/
పూర్తిగా చదవండి ...
ఆత్మరక్షణ కోసం మా వాళ్ళు నాలుగు రాళ్ళు విసిరితే దాడిగా చిత్రించడం పద్దతేనా?
ఇది అన్నది హృద్రోగ చిన్నారులు, వికలాంగుల పక్షాన నిలబడి ఉద్యమించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు. ఎంతవరకు సబబండి ఈ మాటలు?
జూన్ 7 వ తేది, మంగళవారం, 2008 న ఈనాడు దినపత్రిక, మెయ్న్ ఎడిషన్, 4 వ పేజిలోని వార్తని ఇక్కడ చదవండి.
పూర్తిగా చదవండి ...
మా ఉద్యమాలని కించ పరిస్తే ఊరుకోం!
పూర్తిగా చదవండి ...
సాహిత్యం, భాష, యాస, మాండలికం
సాహిత్యంలో మాండలికం, యాస మీద నేటి దిన పత్రిక లో రామకృష్ణ గారి వ్యాసాన్ని ఇక్కడ చదవండి.
పూర్తిగా చదవండి ...
వీళ్ళు ఆ పత్రికని బహిష్కరిస్తున్నారంట!
సైకిల్ మీద తిరిగిన రాధాకృష్ణ ఈ రోజు స్కోడాలొ, బెంజ్ కారులోను తిరుగుతున్నందుకు దుగ్దా, లేదా చలన చిత్ర రంగంలో ఒక అగ్ర తారని బడుగువర్గాల నేతగా ప్రస్తుతిస్తు వార్తలందిస్తున్నందుకు బాధ?
మరి ఇదే రాధాకృష్ణ యాజమాన్యంలోనే ఆంధ్రజ్యోతి బడుగులకోసం పోరాడుతున్న నేతలగురించి రాసినఫ్ఫుడు లేనీ ఆక్షేపణ ఈనాడెందుకు వచ్చింది?
అసలు విషయం ఏది?
* నేటి సాక్షి పత్రికలోని వార్త ఇది.
నిన్నటికి నిన్న లోక్సత్తా (మరాఠీ పత్రిక) సంపాదకుడు - కుమార్ కెట్కర్ మీద శివ సంగ్రాం సమితి సభ్యుల దాడి. మహరాష్ట్ర ప్రభుత్వం, ముంబై సముద్ర తీరాన కొన్ని కోట్ల ఖర్చుతో శివాజి విగ్రహాన్ని స్థాపించడంలోని ఔచిత్యాన్ని తన సంపాదికీయంతో ప్రశ్నించినందుకు ఆ మూక అతని ఇంటిమీద దాడి చేసింది. కొన్ని వేలమంది జీవానోపాధి లేక దుర్భర దారిద్రంతో బతుకు ఈడ్చుకుంటు, కొంత మంది చనిఫోతున్న నేపధ్యంలో ఆ విగ్రహన్ని గురించి ప్రశ్నించినందుకు జవాబు ఆ దాడి.
స్వార్ధ ప్రయోజనాల కోసం ఏ కొద్దిమందో ఇలాంటి "ప్రెజర్ గ్రూప్స్"గా తయారయ్యి, తమ కోరికలను సాధించుకోవడం కొరకు ప్రసారమాధ్యమాలని ఇలా "బ్లాక్మైల్" చెయ్యడం ముక్తకంఠంతో గర్హించాల్సిన సమస్య ఇది.
పూర్తిగా చదవండి ...
ఆంధ్రజ్యోతి పై మరో ఫిర్యాదు - నేటి ఈనాడులో వార్త
పూర్తిగా చదవండి ...
ఆవేశం తగదు
పూర్తిగా చదవండి ...
ఐక్యంగా ఉద్యమిద్దాం
ఆంధ్రజ్యోతి మీద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి దాడి మీద నేటి ఆ పత్రికలో సంగిశెట్టి శ్రీనివాస్ వ్యాసం ఇక్కడ చదవండి.
పూర్తిగా చదవండి ...
దౌర్జన్యం దళితుల తత్వం కాదు
పూర్తిగా చదవండి ...
ఆంధ్రజ్యోతి కులం
పూర్తిగా చదవండి ...
మా కులం కాదు, నీ కలం అమ్ముడుపోయింది
ఆ నేపధ్య వివరం ఇక్కడ సాక్షి లో చదవండి.
పూర్తిగా చదవండి ...