పత్రికలు లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
పత్రికలు లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
ఈ భానుమూర్తి పర్యావరణ పరిరక్షకుడు!
Posted by
netizen నెటిజన్
on 15, అక్టోబర్ 2010, శుక్రవారం
1 వ్యాఖ్యలు
కృషికి, పట్టుదలకి, పర్యావరణ కాలుష్య నియంత్రణకి, నేటి యువతకి, ఆదర్శప్రాయుడు ఈ భానుమూర్తి! రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య రాకుమారుడు చార్ల్స్ నుంచి "గ్రీన్ అంబాసడర్" (పర్యావరణ రాయబారి) పురస్కారాన్ని అందుకున్న తొలి తెలుగు యువకుడు. ఈనాడులో ఈతరం లో ఇక్కడ ఈ ఈతరం భానుముర్తి గురించి చదవండి!
భానుమూర్తి ఇక్కడ "ఆకు పచ్చ స్వెటర్" ధరించడం కేవలం కాకతాళీయమా?
ఈ చాయాచిత్రాన్ని చూసారా? చెత్తో సెల్ఫోన్ పట్టుకుని, చిరునవ్వు చిందిస్తూ కెమరాకి పోజిస్తున్న ఈ "గ్రీన్ అంబాసడర్" నిజం గా అభినందనీయుడే! ఆయన కూర్చున్న కుర్చి ని గమనించారా? స్వివెల్ మొడల్ కుర్చి కదూ? అంటే దాని మీద కూర్చుని ముందుకి వెనక్కి ఉయ్యాల లాగ ఊగచ్చు! అటూ ఇటూ రాట్నం బండి మీద లాగ తిరగనూవచ్చు! చక్కగా, వెన్నుమూక మీద అదనపు భారం పడాకుండా, దానికి తగ్గట్టుగా "ఎర్గొనామిక్" గా రూపొదించించి కుర్చి కదూ?
అంతే లేండి, భారత దేశంలోనే ప్రపధమంగా పర్యావరణ అనుకూలమైన "సోయా ఐస్క్రీమ్" ఉత్పత్తి సంస్థ ని స్థాపించిన మన తెలుగు యువ తేజం కదా! ఆ మాత్రం సుఖంగా కష్టపడకపోతే ఎలా?
నా అనుమానమల్లా, దాని మీద కప్పిన "పాలిథిన్ పొర" ఎంత గ్రీన్ అని? పర్యావరణ కాలుష్యాన్ని, పచ్చదన్నాన్ని , ఈ భూప్రపంచకం మనది కాదు, మన బిడ్డలది, మన భావి తరాలది అనే మన భానుమూర్తి మరి ఆ పురస్కారానికి అర్హుడేనా అని?
అంతేలెండి, భక్తి దేవుని మీద చిత్తం చెప్పుల మీద అనేగా మొన్న ఆమాత్యులవారు , శ్రీమతి గల్లా అరుణ గారు, ఏకంగా గుడిలోపలికే చెప్పులతో దయచేసారంట.
ష్..ష్.ష్..ష్..ష్..ష్..ష్.. అలాంటివి పట్టించుకోకూడదంటారా సరే లేండి!
పూర్తిగా చదవండి ...
మా ఉద్యమాలని కించ పరిస్తే ఊరుకోం!
Posted by
netizen నెటిజన్
on 9, జూన్ 2008, సోమవారం
ఉద్యామాలని కించ పరిస్తే ఊరుకోరటండి వీరు.
వారికి స్వేచ్హ కావాలి.
స్వతంత్రం కావాలి.
వారి అభిప్రాయాల్ని వెలిబుచ్చడానికి ప్రసార మాధ్యమాలు కావాలి.
వారిని ఆకాశానికేత్తసేటప్పుడు మాత్రమే పత్రికలు కావాలి, టీ వీలు కావాలి.
వారిని ఏ మాత్రం విమర్శిస్తున్నారన్న అనుమానం ఉన్నా,పెట్రొల్ కాని డిజెల్ కాని కిరోసిన్ పోసి, తగలబెట్టే హక్కు కూడా వారికే ఉంటుంది.
అప్పుడు మాత్రం ఆ పత్రికలు పనికి రావు.
ఆ టీ వీలు చూపే బొమ్మలు పనికిరావు.
వాటిలో పనిచేస్తున్న తమ "కులం" వాళ్ళైనా కూడా పనికిరారు.
వాళ్ళందరిని "కాటి" కి చేర్చడానికి కూడా వెనుకాడరు వీరు.
వారు, వారి ఉద్యమాలని కించ పరిస్తే ఊరుకోరటండి.
మంగళవారం 7 వ తేదిన, జూన్ 2008లో, పేజి 8లో సాక్షి దినపత్రికలో ప్రచురితమైన వార్త ఇక్కడ చదవండి.

పూర్తిగా చదవండి ...
లేబుళ్లు:
పత్రికలు
"సాక్షి" సాక్ష్యంపై మీ తీర్పు ఏమిటి?
Posted by
netizen నెటిజన్
on 26, ఏప్రిల్ 2008, శనివారం
పోలేపల్లిలో కొన్ని పొలాలను ప్రస్థుత ప్రభుత్వం స్వాధినం చేసుకుని, ప్రత్యేక ఆర్ధిక మండలి (S E Z - Special Economic Zone)ని ఏర్పాటు చేసి ఆ స్థలాలని కొన్ని వ్యాపార సంస్థలకు ఇచ్చిందన్నది వార్త. ఆ భూసేకరణ మూలంగా కొంత మంది రైతులు ప్రాణాలు కోల్పొయ్యారన్నది ఈనాడు కధనం.
చనిపోయినవారిలో "వెంకన్న" ఒకడు. అతన్ని గురించి ఈనాడు ఒక ప్రత్యేక కధనం వెలువరించింది.
ఈనాడు ఉదహరించిన "వెంకన్న" చనిపోలేదు. అతను బ్రదికే ఉన్నాడని "సాక్షి" దిన పత్రిక దానిని ఖండిస్తు ఒక వార్తని ప్రచురించించింది.
ఈ వ్యవహారం బ్లాగ్లోకంలోకి విశాఖతీరాన ప్రవేశించింది.
క్లుప్తంగా ఈ టపా నేపధ్యమిది.
చెరుకూరి రామోజి రావు కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర్ కి ఉన్న మనస్పర్ధలు చదువరులకి తెలుసు.
రామోజీ రావు వ్యాపార సంస్థలమీద ప్రస్తుత అధికార ప్రభుత్వం చేస్తున్న అధికారిక అనధికారిక నిజనిర్ధారణ దాడుల గురించి కూడ చదువరులకు తెలుసు.
నిష్పక్షపాత దినపత్రిక "సాక్షి" ని మొదలుబెట్టడానికి కారణం, "అసలు" విషయాలను "రంగు" పులమకుండా తెలుగు ప్రజలకు చేరవేయాలన్న సదుద్దేశమని రాజసేఖరుడి తనయుడు, జగతి పబ్లికేషన్స్ అధినేత, సాక్షి ప్రచురణకర్త, జగన్మోహన్ రెడ్డి తెలిపినది కూడా మీకు తెలుసు.
ప్రభుత్వం వల్ల జరిగిన అవకతవకలను "ఎండగడుతు" ప్రసార మాధ్యమాలు ప్రత్యేక కధనాలను ప్రచురించినప్పుడు, దానికి జవాబుని తత్సంభదిత ప్రభుత్వ అధికారులు ఇవ్వడం ఇప్పటిదాక ఉన్న సత్సంప్రదాయం.
"ఒక పత్రిక"లో వచ్చిన వార్తని "ఖండిస్తు" మరో నిష్పక్షపాత పత్రిక కధనాన్ని వెలువరింఛడం కొత్త సంప్రదాయాలకు తెర తీస్తున్నది.
వ్యాపార సంస్థలకు లభార్జన కూడ ముఖ్యమే.యాజమాన్యలకు లాభాలు ఒక్కటే కాదు కొన్ని నైతిక విలువలుకూడా ఉండాలి. నేటితో అది తెలుగు వార్తా పత్రికలలో కొరవడింది. యాజమాన్యాల ఒత్తిడికి లొనయ్యే "మరుగుజ్జు" సంపాదకులున్నంత కాలం ఇక ఇటువంటి "కష్మలం" తో కూడిన వార్తలను చూడక తప్పదేమో.
ఆంగ్ల ప్రసార మాధ్యమాల అధినేతలు రాబర్ట్ మాక్స్వెల్ (Robert Maxwell), రూపర్ట్ మర్డాక్ (Rupert Murdoch) నిజ జీవితాలను ప్రతిబింబిస్తూ , జెఫ్రి ఆర్చర్ (Jeffrey Archer) వ్రాసిన "ఫోర్త్ ఎస్టేట్" (Fourth Estate) నవలను తలపింపజేస్తున్నవి మన ఈ తెలుగు దిన పత్రికలు.
చనిపోయినవారిలో "వెంకన్న" ఒకడు. అతన్ని గురించి ఈనాడు ఒక ప్రత్యేక కధనం వెలువరించింది.
ఈనాడు ఉదహరించిన "వెంకన్న" చనిపోలేదు. అతను బ్రదికే ఉన్నాడని "సాక్షి" దిన పత్రిక దానిని ఖండిస్తు ఒక వార్తని ప్రచురించించింది.
"సాక్షి" వ్రాతలను ఎద్దేవా చేస్తు "ఈనాడు" వ్యాసం ఇక్కడ.
ఈ వ్యవహారం బ్లాగ్లోకంలోకి విశాఖతీరాన ప్రవేశించింది.
క్లుప్తంగా ఈ టపా నేపధ్యమిది.
చెరుకూరి రామోజి రావు కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర్ కి ఉన్న మనస్పర్ధలు చదువరులకి తెలుసు.
రామోజీ రావు వ్యాపార సంస్థలమీద ప్రస్తుత అధికార ప్రభుత్వం చేస్తున్న అధికారిక అనధికారిక నిజనిర్ధారణ దాడుల గురించి కూడ చదువరులకు తెలుసు.
నిష్పక్షపాత దినపత్రిక "సాక్షి" ని మొదలుబెట్టడానికి కారణం, "అసలు" విషయాలను "రంగు" పులమకుండా తెలుగు ప్రజలకు చేరవేయాలన్న సదుద్దేశమని రాజసేఖరుడి తనయుడు, జగతి పబ్లికేషన్స్ అధినేత, సాక్షి ప్రచురణకర్త, జగన్మోహన్ రెడ్డి తెలిపినది కూడా మీకు తెలుసు.
ప్రభుత్వం వల్ల జరిగిన అవకతవకలను "ఎండగడుతు" ప్రసార మాధ్యమాలు ప్రత్యేక కధనాలను ప్రచురించినప్పుడు, దానికి జవాబుని తత్సంభదిత ప్రభుత్వ అధికారులు ఇవ్వడం ఇప్పటిదాక ఉన్న సత్సంప్రదాయం.
"ఒక పత్రిక"లో వచ్చిన వార్తని "ఖండిస్తు" మరో నిష్పక్షపాత పత్రిక కధనాన్ని వెలువరింఛడం కొత్త సంప్రదాయాలకు తెర తీస్తున్నది.
వ్యాపార సంస్థలకు లభార్జన కూడ ముఖ్యమే.యాజమాన్యలకు లాభాలు ఒక్కటే కాదు కొన్ని నైతిక విలువలుకూడా ఉండాలి. నేటితో అది తెలుగు వార్తా పత్రికలలో కొరవడింది. యాజమాన్యాల ఒత్తిడికి లొనయ్యే "మరుగుజ్జు" సంపాదకులున్నంత కాలం ఇక ఇటువంటి "కష్మలం" తో కూడిన వార్తలను చూడక తప్పదేమో.
ఆంగ్ల ప్రసార మాధ్యమాల అధినేతలు రాబర్ట్ మాక్స్వెల్ (Robert Maxwell), రూపర్ట్ మర్డాక్ (Rupert Murdoch) నిజ జీవితాలను ప్రతిబింబిస్తూ , జెఫ్రి ఆర్చర్ (Jeffrey Archer) వ్రాసిన "ఫోర్త్ ఎస్టేట్" (Fourth Estate) నవలను తలపింపజేస్తున్నవి మన ఈ తెలుగు దిన పత్రికలు.
పూర్తిగా చదవండి ...
తెలుగు పాత్రికేయుడి కి సాయినాధ్ ప్రోత్సాహక పురస్కారం
Posted by
netizen నెటిజన్
on 8, ఫిబ్రవరి 2008, శుక్రవారం
రామన్ మెగ్సెసే పురస్కార గ్రహీత , పాలగుమ్మి సాయినాధ్, తెలుగు పాత్రికేయులకు తన తరఫున ఒక పురస్కారాన్ని

ప్రకటించాడు. ఆంధ్రదేశంలోని గ్రామిణ ప్రాంతాల సమస్యలను వెలికి తెచ్చిన తెలుగు పాత్రికేయుడికి ఈ పురస్కారం బహుకరించబడుతుంది. చాలా మంచి విషయం ఇది. ఇన్నాళ్ళు ఇలాంటి పురస్కారాన్ని తెలుగు వార్తాపత్రికలు కాని వాటి యాజమాన్యాలు కాని, ఎందుకని ప్రతిపాదించలేదో?

ప్రకటించాడు. ఆంధ్రదేశంలోని గ్రామిణ ప్రాంతాల సమస్యలను వెలికి తెచ్చిన తెలుగు పాత్రికేయుడికి ఈ పురస్కారం బహుకరించబడుతుంది. చాలా మంచి విషయం ఇది. ఇన్నాళ్ళు ఇలాంటి పురస్కారాన్ని తెలుగు వార్తాపత్రికలు కాని వాటి యాజమాన్యాలు కాని, ఎందుకని ప్రతిపాదించలేదో?
విద్యా, ఆరోగ్య రంగాలలో కూడా ఇలాంటి పురస్కారలుంటే బాగుంటుంది.
బ్లాగర్ మిత్రులార, ఆసక్తి, అవకాశం, ఆర్ధిక బలం ఉన్న వారితో ఈ ప్రతిపాదన చర్చించండి. సానుకూల పరిస్థితులను తయారు చేయండి.
ఒక సాహిత్యం, ఒక నాటకం, ఒక కవిత్వం, ఒక చలన చిత్ర నటుడు, ఒక నటి మాత్రమే కాదు. ప్రపంచంలో "ప్రోత్సాహం" కొరవడినవి ఇంకా చాలా ఉన్నవి. అన్నింటికి అందరు చెయ్యలేరు. ఎదో ఒక రంగం ఎన్నుకుని, పదిమంది కలిసి చెయ్యాగలిగినవి, చెయ్యదిగినవి చాల ఉన్నవి. ఆ దిశగా ఆలోచించమని మనవి.
ఇక విద్య విషయానికి వస్తే:
ప్రతి సంవత్సరం, పరిక్షలు వ్రాసిన తరువాత, వచ్చిన పలితాలు, ప్రధమ శ్రేణిలో ఉత్తిర్ణులైన విద్యార్ధిని, విద్యార్దుల గురించి పత్రికలు అన్ని వ్రాస్తునే ఉంటాయి. ప్రతి సంవత్సరం జరిగే క్రతువే ఇది.
అలాగే సామాజిక, ఆర్ధిక, సాంఘిక కారణాల వల్ల కొంత మంది విద్యార్దిని,విద్యార్ధులు పైచదువులకు వెళ్ళలేకపోవడం,వారి గురించి ప్రసార మాధ్యమాలు, తమ "ప్రత్యేక" కధనాలు చదివించడం, చూపించడం క్రమం తప్పకుండా జరుగుతునే ఉన్నది.
అల్లాంటి, విద్యార్ధులను ఇప్పటి నుండే గుర్తించి ఒక నియమానువళిసారం, వారికి కావలిసిన వనరులను ఏర్పాటు చేయవచ్చు. దానివల్ల ఆఖరి నిమిషందాకా, ఆ విద్యార్ధిని, ఆ కుటుంబం పడే ఇబ్బందులను తప్పించినవారవుతారు.
దేశానికి, మీరు మరొక మంచి పౌరుడిని అందించిన వారవుతారు!
ఇక సాయినాధ్ గారి పురస్కారం గురించి ఇక్కడ చదువుకోవచ్చు :The Hindu
ఇక్కడ p d f file
* విశాఖతీరాన రాజేంద్ర గారు, తొడ గొట్టగలరా?
* ప్రదీపుగారు, మీ "బ్లాగుల పుస్తకం" లోకి బ్లాగులను ఎన్నుకోవడం ఎలా అన్న మీ ప్రశ్నకు ఇక్కడ సూక్ష్మంగానైనా జవాబు దొరికిందా?
వివరాలకు:K. Jojaiah, Secretary, Foundation for People's Journalism, Sundaraiah Vignana Kendram, Bagh Lingampalli, Hyderabad- 500 044 on or before March 5.
పూర్తిగా చదవండి ...
లేబుళ్లు:
పత్రికలు,
sainath telugu award journalist
ప్రసార మాధ్యమాలు - ఒబిట్ లు
Posted by
netizen నెటిజన్
on 7, ఫిబ్రవరి 2008, గురువారం
చనిపోయైన వారి గురించి మంచిమాటలు చెప్పుకోవాలి. పోయిన వారు ఎటూపొయ్యారు. మళ్ళీ వారిని విమర్శించనేలా?
ఆ మధ్య ఒక పెద్ద మనిషి చనిపొయాడు. బాగా పరిచయమున్న వ్యక్తి. ఒకానొక వామపక్ష పత్రికలో ఉద్యోగం చేసాడు. వాటికి ఉన్న సాంస్కృతిక సంఘాలకు సహజంగానే దగ్గిరయ్యాడు. సాహిత్యం, సాహిత్య కారులు, అరసం, విరసం, సరసం, నీరసం అన్నింటిని తిట్టేవాడు. డబ్బున్నవాళ్ళతో తిరిగి చందాలు వసూలు చేసేవాడు. సినిమా ప్రపంచంలో వామపక్ష వాదులతో పరిచయమున్నవాళ్ళతో భుజాలు కలిపేవాడు. ఆ పేర్లు తనకి అవసరం అనుకునే చోట వాడుకునేవాడు.
ఏదో కారాణాల వల్ల (అవి మనకి అనవసరం) చేస్తున్న దినపత్రికనుండి ఒక ఫారిన్ మిషన్ వారి పత్రికా కార్యాలయంలో చిన్న ఉద్యోగం సంపాదించుకున్నాడు. అది కాస్త మూతపడింది. బాక్ టు హోం.
స్థూలంగా ఒక పాత్రికేయుడు గా ఇది అయన జీవితం.
పుట్టుట గిట్టుట కొరకే కదా. వయసు మీద కొచ్చింది. అనారోగ్యంతో హాస్పిటలో ట్రీట్మెంట్ తీసుకుంటు చనిపొయ్యాడు.
ఒక ప్రముఖ అంగ్ల దిన పత్రికలో, ఒబిట్ వ్రాస్తు అయనని ఆ ఫారిన్ మిషన్ పత్రికకు ఏకంగా "సంపాదకుడు" ని చేసేసారు.
దీన్నేమనాలి?
"ప్రసార మాధ్యమాల్లో ప్రముఖుల మరణాలు" చదివిన తరువాత;
ఆ మధ్య ఒక పెద్ద మనిషి చనిపొయాడు. బాగా పరిచయమున్న వ్యక్తి. ఒకానొక వామపక్ష పత్రికలో ఉద్యోగం చేసాడు. వాటికి ఉన్న సాంస్కృతిక సంఘాలకు సహజంగానే దగ్గిరయ్యాడు. సాహిత్యం, సాహిత్య కారులు, అరసం, విరసం, సరసం, నీరసం అన్నింటిని తిట్టేవాడు. డబ్బున్నవాళ్ళతో తిరిగి చందాలు వసూలు చేసేవాడు. సినిమా ప్రపంచంలో వామపక్ష వాదులతో పరిచయమున్నవాళ్ళతో భుజాలు కలిపేవాడు. ఆ పేర్లు తనకి అవసరం అనుకునే చోట వాడుకునేవాడు.
ఏదో కారాణాల వల్ల (అవి మనకి అనవసరం) చేస్తున్న దినపత్రికనుండి ఒక ఫారిన్ మిషన్ వారి పత్రికా కార్యాలయంలో చిన్న ఉద్యోగం సంపాదించుకున్నాడు. అది కాస్త మూతపడింది. బాక్ టు హోం.
స్థూలంగా ఒక పాత్రికేయుడు గా ఇది అయన జీవితం.
పుట్టుట గిట్టుట కొరకే కదా. వయసు మీద కొచ్చింది. అనారోగ్యంతో హాస్పిటలో ట్రీట్మెంట్ తీసుకుంటు చనిపొయ్యాడు.
ఒక ప్రముఖ అంగ్ల దిన పత్రికలో, ఒబిట్ వ్రాస్తు అయనని ఆ ఫారిన్ మిషన్ పత్రికకు ఏకంగా "సంపాదకుడు" ని చేసేసారు.
దీన్నేమనాలి?
"ప్రసార మాధ్యమాల్లో ప్రముఖుల మరణాలు" చదివిన తరువాత;
పూర్తిగా చదవండి ...
లేబుళ్లు:
పత్రికలు
కత్తికి రెండు వైపులా పదునే!
Posted by
netizen నెటిజన్
on 7, సెప్టెంబర్ 2007, శుక్రవారం
నిజమే!
ప్రసార మాధ్యమాలు కావాలి.కాని అవి తమ హద్దులేరగాలి అన్న ఈ నెటిజన్ మాట ఏమిటో చూద్దాం అని వేలాదిగా వచ్చిన మీ అందరికి కృతజ్ఞతలు.
అటు మొన్నటి రాకుమారి డయాన నుండి నిన్నటి రవీంద్ర రెడ్డి, లాలసల - రోహిత్ వరకు మొన్న లోకేష్ - బ్రహ్మణిల వివాహం నుండి నిన్న పవన్ "కల్యాణ్" వరకు "కాదేవరు మాకు అడ్డు" అంటూ ప్రసార మాధ్యామాలు - వాటి మధ్య చిక్కి విలవిలాడుతున్న నేటి "మనిషి" దయనీయ పరిస్థితి చూసారుగా?
ఈ పరిమితి తెలుగు బ్లాగులకి మాత్రమేనని, మన తెలుగు ప్రసారమధ్యమాల వరకే అని అనుకోవద్దు.
ఈ నెటిజన్ అభిప్రాయంతో ఏకీభవించే మరొక ఆంగ్ల దినపత్రికలోని వార్త ఇక్కడ చూడండి.
పూర్తిగా చదవండి ...
లేబుళ్లు:
పత్రికలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)

